Sunday, 26 July 2026 10:01:06 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మసీదు కమిటీకి వక్ఫ్ బోర్డు భూములకు సంబంధం లేదు

వక్ఫ్ బోర్డు భూములపై రాజకీయం చేయడం తగదు - భూమి వారసులు

Date : 23 December 2025 08:03 AM Views : 137

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె కదిరి రోడ్డులోని వక్ఫ్ బోర్డు భూములకు జామియా మసీదు కమిటీ పెద్దలకు ఎలాంటి సంబంధం లేదని బాధితులు నూర్జహాన్ బేగం, శవాల్ బేగం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సోమవారం వారు తమ స్వగృహం నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం అవుతున్నట్లు మసీదు పెద్దలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అయితే వక్ఫ్ బోర్డు భూములు పూర్వీకుల నుంచి తమకు సంక్రమించాయని, ఇందులో ఎలాంటి కబ్జాలు లేవన్నారు. గత ప్రభుత్వాలు వక్ఫ్ బోర్డు చట్టప్రకారం సగం భూమి వక్ఫ్ బోర్డుకు, మిగతా సగం భూమి తమ పూర్వీకులకు కేటాయించారన్నారు. అయితే వక్ఫ్ బోర్డు భూముల వివాదం తెరపైకి రావడంతో కోర్టులో కేసు వేశామన్నారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోందని అక్కడే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యంగా న్యాయస్థానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. వక్ఫ్ బోర్డు భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోని కమిటీ పెద్దలు భూముల అన్యాక్రాంతంపై చర్చకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. వక్ఫ్ బోర్డు భూముల అన్యాక్రాంతం, దురాక్రమణ, ఇతర అంశాలపై కోర్టులో కేసు వేశామని వివరించారు. కోర్టు కేసుపై ఎవరూ జోక్యం చేసుకోకూడదన్నారు. న్యాయస్థానం తీర్పుకు అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు. అయితే ఈ భూములకు కమిటీ పెద్దలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. వక్ఫ్ బోర్డు భూములపై రాజకీయం చేయడం తగదన్నారు. కమిటీ పెద్దలు రాజకీయ కోణంలో ఆలోచిస్తూ వక్ఫ్ బోర్డు భూముల ఆక్రమణకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇది తమ పూర్వీకులు కొనుక్కున్న భూమని వారినుండీ సంక్రమించిన ఈ భూమికి తామే వారసులమన్నారు. ఈ భూమితో కమిటీ పెద్దలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అనవసరంగా జోక్యం చేసుకుని రాజకీయ రంగు పులిమారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్ రెడ్డి, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :