Sunday, 26 July 2026 09:53:19 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఉపాధి హామీ పనులు, కూలీలను పెంచాలి - డ్వామా పీ.డి. వెంకటరత్నం

Date : 09 December 2025 08:22 PM Views : 192

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 09 : తంబళ్లపల్లి మండలంలో ఉపాధి హామీ పనులు పెంచి కూలీలకు ఉపాధి చూపించకపోతే కఠిన చర్యలు తప్పవని డ్వామా పీడి వెంకటరత్నం క్షేత్ర సహాయకులను హెచ్చరించారు. మంగళవారం ఆయన ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీలకు సిబ్బందితో సమీక్ష జరిపారు. ఉపాధిలో ఫారం పాండ్స్, కంపోస్ట్ ఫిట్స్, పశువుల షెడ్లు, సోంపిట్సి నిర్దేశిత లక్ష్యాలను అధిగమించాలన్నారు. గతంలో ఇచ్చిన టార్గెట్లను పూర్తి చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారంలోపు పనులు ఊపందుకోవాలన్నారు. ఫారం పాండ్స్ , కంపోస్ట్ ఫిట్స్ రైతుల పొలాలతోపాటు ప్రభుత్వ స్థలాలలో పనులు చేపట్టాలన్నారు. జాబ్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్కరికి పనులు కల్పించాలని సూచించారు.తొలుత ఆయన కన్నెమడుగు సచివాలయం ఆకస్మిక తనిఖీ నిర్వహించి రికార్డులతో పాటు సిబ్బంది పనితీరు పై సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సమీక్షలో ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవో లు ప్రసాద్, మారుతీ కుమార్, ఏపీఓ అంజనప్ప, ఈసీ మహేష్, టెక్నికల్ అసిస్టెంట్లు సుజాత, పుష్ప కుమారి, బాలగంగాధర్, భూదేవి, మండలంలోని క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :