Monday, 27 July 2026 02:43:00 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

భగత్ సింగ్ కాలనీ లో పోలీసుల కార్డ్ ఆన్ సెర్చ్ తో అణువణువూ జల్లెడ

Date : 11 April 2026 02:48 PM Views : 156

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - ఏప్రిల్ 11: శనివారం వేకువజామున సూర్యకిరణాలు సరిగ్గా నేలను తాకకముందే పుంగనూరు పట్టణం లోని భగత్ సింగ్ కాలనీ లో ఒక్కసారిగా ఖాకీల పహారా లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు

జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో మదనపల్లి సబ్ డివిజన్ పోలీసు యంత్రాంగం అలికిడి లేకుండా కాలనీని చుట్టుముట్టింది. నేర రహిత సమాజమే లక్ష్యంగా చేపట్టిన ఈ 'కార్డ ఆన్ సెర్చ్' ఆపరేషన్, అణువణువునూ జల్లెడ పట్టారు. సుమారు 50 మంది పోలీసు సిబ్బంది బృందాలుగా విడిపోయి, కాలనీలోని ప్రతి సందును, ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరించడంతో పాటు, సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించేందుకు రికార్డులను పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా అత్యంత వ్యూహాత్మకంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. సోదాల అనంతరం పుంగనూరు అర్బన్ సీఐ సుబ్బరాయుడు కాలనీ వాసులకు కౌన్సిలింగ్ ఇస్తూ వారికి భద్రతపై భరోసా కల్పిస్తూ మీ భద్రతే మా ప్రాధాన్యత, మీ వీధిలో అపరిచితులు తచ్చాడుతున్నా, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా వెనుకాడకుండా పోలీసులకు సమాచారం ఇవ్వండి అని విజ్ఞప్తి చేశారు. ఇళ్లు అద్దెకు ఇచ్చే ముందు అద్దెదారుల వివరాలు ఆరా తీయాలని, వేసవి కాలంలో ఇంటి జాగ్రత్తలు తీసుకోవాలని, సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చని అవగాహన కల్పించారు

ఆపరేషన్‌లో పుంగనూరు రూరల్ సీఐ సాయి ప్రసాద్ గారితో పాటు ఎస్సైలు అన్సార్ బాషా, రమణ, చంద్రశేఖర్, రమేష్ తమ సిబ్బందితో కలిసి ప్రతి ప్రాంతాన్ని పర్యవేక్షించారు. సుమారు 50 మందికి పైగా సిబ్బంది ఏకకాలంలో రంగంలోకి దిగి కార్డ్ ఆన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: