Sunday, 26 July 2026 05:40:17 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం ఎక్లిటిక 2026

ముఖ్య అతిధిగా బెంగళూరు లోని టియెటో ఎవ్రీ ఇండియా డెలివరీ సెంటర్ లోని స్పెషలైజ్డ్ ఇంజినీరింగ్ సర్వీసెస్ హెడ్‌శరణ్ కాంతికర్

Date : 01 April 2026 11:14 PM Views : 245

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 01 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగము వారు జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం ఎక్లిటిక 2026 (ECLECTICA-2026) కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శరణ్ కాంతికర్, స్పెషలైజ్డ్ ఇంజినీరింగ్ సర్వీసెస్ హెడ్‌, టియెటో ఎవ్రీ ఇండియా డెలివరీ సెంటర్, బెంగళూరు పాల్గొని, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వి.ఎల్.ఎస్.ఐ (VLSI) టెక్నాలజీ యొక్క ప్రాధమిక సమాచారం, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ డిజైన్ మరియు ఫ్యాబ్రికేషన్ ప్రక్రియ, పరిశ్రమ అవసరాలు, ఇంటర్వ్యూకు సిద్ధమయ్యే విధానం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కమ్యూనికేషన్ టెక్నాలజీల అభివృద్ధితో సమాచార మార్పిడి వేగవంతంగా మరియు సులభంగా మారిందని, 5G నెట్‌వర్క్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతికతలు ఈ రంగాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాయని అన్నారు . వీటి ద్వారా స్మార్ట్ సిటీస్, ఆటోమేషన్, హెల్త్‌కేర్, ట్రాన్స్‌పోర్టేషన్ వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎలక్ట్రానిక్స్ విద్యార్థులకు టెలికమ్యూనికేషన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్, సిగ్నల్ ప్రాసెసింగ్ వంటి విభాగాల్లో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. నేటి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు ప్రాక్టికల్ నైపుణ్యాలు, సాంకేతిక జ్ఞానం మరియు సృజనాత్మక ఆలోచనలను అభివృద్ధి చేసుకోవడం అత్యంత అవసరం అని అన్నారు. ఇటీవల భారత ప్రభుత్వం ప్రారంభించిన “సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్” ద్వారా దేశంలో చిప్ తయారీ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకున్నారని తెలిపారు. దీని ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ మరియు ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో లభించే ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, డీన్-అకాడెమిక్స్ డాక్టర్ రామ ఎస్ కొమరగిరి, విభాగాధిపతి డాక్టర్ సంజయ్ కుమార్ సి గౌరె , కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్.కె నూరుల్ ఇస్లాం, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: