నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 01 : తంబళ్లపల్లె లోని శ్రీ టి ఎన్ వెంకట సుబ్బారెడ్డి మెమోరియల్ ఐటిఐలో సోమవారం జరిగిన జాబ్ మేళాలో ఎన్నడూ లేని విధంగా వందశాతం నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందడం హర్షనీయమని ప్రిన్సిపాల్ నాగరాజు కొనియాడారు. ఉదయం ప్రిన్సిపాల్ నాగరాజు ఆధ్వర్యంలో శ్రీజ తిరుపతి పాలడైరీ, అమర్ రాజా, వీ టి ఎస్ బెంగళూరు, యుఎన్ఓ మైన్ బెంగళూరు, ఎల్ అండ్ టి కాంచీపురం, సాయి ఎంటర్ప్రైజెస్ బెంగళూరు కంపెనీలకు చెందిన ప్రతినిధులు 58 మంది నిరుద్యోగులను వారి ప్రతిభను పరీక్షించి 58 మంది ని 100% ఎంపిక చేసుకొని నియామక పత్రాలను ప్రిన్సిపాల్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించిన కంపెనీ యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉద్యోగ అవకాశాలు పొందిన నిరుద్యోగులు అంకితభావంతో ఉద్యోగాలలో చేరి ఆర్థిక అభివృద్ధి సాధన తో పాటు తంబళ్లపల్లె ఐటిఐ కి మంచి పేరు తేవాలని సూచించారు. ఎంపికైన విద్యార్థులు మాట్లాడుతూ తంబళ్లపల్లె ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం నిస్వార్థంగా ఐటిఐ స్థాపించిన టి.ఎన్ కుటుంబ సభ్యులకు జీవితాంతం రుణపడి ఉంటామని అదేవిధంగా ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం, ఉద్యోగ అవకాశాలు కల్పించిన కంపెనీ యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో శ్రీజ పాల డైరీ ఏరియా మేనేజర్ కృష్ణప్ప తోపాటు ప్రతినిధులు, ఐటిఐ అధ్యాపకులు, నిరుద్యోగులు పాల్గొన్నారు
Reporter
Namitha News