నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - జనవరి 24 : నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో రవితేజ కళ్యాణమండపం నందు నెల్లూరుకు చెందిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్య సిబ్బంది విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యాన్ని వారు వివరిస్తూ నెల్లూరులో ఉన్న మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం తమ హాస్పిటల్ వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధతో గ్రామీణ ప్రాంతంలో కూడా తమ వైద్య సేవలు అందించాలనే సంకల్పం తో ఆత్మకూరు ప్రాంత గ్రామీణులు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ జయరాం యాదవ్ మాట్లాడుతూ గుండె సంబంధిత వ్యాధి పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ముందస్తుగా తెలుసుకున్న సూచనలతో ప్రతి ఒక్కరు గుండె వ్యాధిని నివారణకు చర్యలు తీసుకోవచ్చని, అలాగే వ్యాధి పట్ల చాలామందికి అవగాహన లేక వ్యాధి సోకినప్పుడు దానికి వైద్య సేవలు ఎక్కడ అందుతాయో అనే అవగాహన లేక , హాస్పిటల్ కు సమయానికి చేరుకోవడానికి సమయం సరిపోక ఈ మూడు కారణాలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని,వీటిని ప్రజలకు చేరువకు తెచ్చే విధంగా మా మెడికవర్ హాస్పిటల్ ప్రయత్నం చేయడానికి, మేము సిద్ధంగా ఉన్నామని, అంతే కాక గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే మా ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు. ఆత్మకూరు లోని బిఎస్సార్ హాస్పిటల్, అభిరామ్ హాస్పిటల్ కు మా హాస్పటల్ వైద్యులు వస్తూ ఉంటారని వారు వచ్చే తేదీలను, వైద్య నిపుణుల వివరాలను తెలియపరిచారు. ఈ సమావేశానికి మెడికల్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ రంజిత్ రెడ్డి, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ జయరాం యాదవ్, హాస్పిటల్ ప.ఆర్.ఓ. సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News