నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 16 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రం లో 2047 విజన్ లో భాగంగా సుమారు కోటిన్నరతో చేపట్టిన అభివృద్ధి పనులకు సహకరించిన ప్రత్యేక అధికారి అన్నమయ్య జిల్లా పీ.డి వెంకటరత్నంకు టిడిపి నేతలు, స్థానిక ప్రజలు ప్రశంసల జల్లు కురిపించారు. ఉదయం తంబళ్లపల్లె ఆర్టీసీ బస్టాండ్ నుండి కోర్టు, శ్రీనివాస కాలనీ, సాలె వీధి, మసీదు వీధి, బస్టాండ్ కాలనీ లలో జరిగిన అభివృద్ధి పనుల నాణ్యత ను పీ.డి పరిశీలించి సంతృప్తి చెంది సంబంధిత కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డి, సూర్య కుమార్ రెడ్డిలతో బాటు సహకరించిన టిడిపి నేతలను ప్రశంసించారు. ఆయన వెంట ఎంపీడీవో ఎంపీ ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో మారుతీ కుమార్, ఏపీఓ అంజనప్ప, ఈసీ మహేష్, కార్యదర్శి శ్రీనివాసరావు, టిడిపి నేత నరసింహులు, పి ఆర్ ఏ ఈ వెంకటరమణ, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్,తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News