నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 26 : రామసముద్రం మండలం లోని ఎలవానెల్లూరు గ్రామపంచాయతీ దాసార్ల పల్లె గ్రామంలో శుక్రవారం ఇంటి పన్ను వసూళ్లు ప్రక్రియయను డిప్యూటీ ఎంపిడిఓ గపూర్ పరిశీలించారు . ఈ సందర్బంగా పంచాయతీ కార్యదర్శి, సచివాలయం సిబ్బందితో కలిసి పన్నులు వసూళ్లు వివరాలను సమీక్షించారు. గ్రామ పంచాయతీలో పేరుకు పోయిన పన్ను వసూళ్లను వేగవంతం చేసి లక్ష్యాలను పూర్తి చేయాలని పంచాయతీ అధికారులకు సూచించారు. అలాగే కురిజల గ్రామపంచాయతీ డోర్ టూ డోర్ గార్బెజ్ కలెక్షన్ ఎస్ డబ్ల్యూ పి సి షెడ్ తనిఖీ చేసి గ్రామంలో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపిడిఓ గపూర్, పంచాయతీ కార్యదర్శి రెడ్డి ప్రసాద్, సచివాలయం సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు.
Admin
Namitha News