నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎస్.రెడ్డీ సాహెబ్ నిర్విరామ కృషి - కొనియాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు - పార్టీ శ్రేణులు,అభిమానుల మధ్య ఘనంగా పుట్టినరోజు వేడుకలు మదనపల్లె : కాంగ్రెస్ పార్టీలో అత్యంత సమర్థవంతమైన నాయకుడు ఎస్.రెడ్డి సాహెబ్ అని మదనపల్లె నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు.పట్టణంలోని దొంతి వీధి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఎస్.రెడ్డీ సాహెబ్ పుట్టిన రోజు వేడుకలు పండుగ వాతావరణంలో జరిగాయి.నాయకులు,కార్యకర్తలు అభిమానులు దుశ్శాలువతో ఘనంగా సన్మానించి,కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీనే తన ఊపిరిగా భావించి పార్టీ అభ్యున్నతి కోసం ఎస్.రెడ్డి సాహెబ్ అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు.పార్టీ కార్యక్రమాలను చురుకుగా నిర్వహిస్తూ అధిష్టానం వద్ద తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారన్నారు.నిరంతరం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి,కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఎస్.రెడ్డి సాహెబ్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.అనంతరం రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ చిన్నతనం నుండి తనకి కాంగ్రెస్ పార్టీ అంటే అంతులేని అభిమానం అని,ఆ అభిమానమే తనను కాంగ్రెస్ పార్టీకి మరింత చేరువ చేసిందన్నారు.దేశ ప్రజల సంక్షేమం,శ్రేయస్సు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు.ఇప్పటి నుండే ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసే 2029లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకొని మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాన్ని నెరవేర్చాలని ఆయన పిలుపునిచ్చారు.అదేవిధంగా తనపై ఎంతో అభిమానంతో పుట్టినరోజు వేడుకలకు విచ్చేసి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని,ఇదే అభిమానం మున్ముందు తనపై కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకురాలు మీనా కుమారి,అన్నమయ్య జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శరత్ కుమార్ రెడ్డి,ఈశరయ్య,మహబూబ్ పీర్,నాగరాజు,ఖాసీం వలి,ఈశ్వరమ్మ,అల్లాబక్షు,హబీబ్,జీవన్ కుమార్,అసీఫ్,మౌలాలి,బావజాన్ మరియు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News