నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 11 : టెన్త్ విద్యార్థులు రాబోయే పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చాలని డివిజనల్ డిప్యూటీ విద్యాశాఖ అధికారి లోకేశ్వర్ రెడ్డి సూచించారు. బుధవారం ఆయన మండలంలోని కోసువారిపల్లి జడ్పీ హైస్కూల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి విద్యా ప్రమాణాలను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. టెన్త్ విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా పట్టుదల సడలకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా 9వ తరగతి విద్యార్థులకు బ్రిడ్జి కోర్స్ కు సంబంధించిన విషయాలు తెలియజేశారు. పాఠశాల హెడ్ మాస్టర్ తో పాటు అధ్యాపక బృందం టెన్త్ విద్యార్థుల విద్యా ప్రమాణాలపై దృష్టి సారించి వారి సమస్యలను పరిష్కరించి ఉత్తమ ఫలితాలు సాధనకు సహకరించాలన్నారు. ఆయన వెంట హెడ్మాస్టర్ నందకుమార్ మరియు అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News