Monday, 27 July 2026 03:31:17 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

తప్పుడు పత్రాలు సృష్టించి మా స్థలాలపై కన్నేశారు - మా తాత్కాలిక కట్టడాలను కూల్చివేశారు

న్యాయం చేయాలంటూ అధికారులకు బాధితులు విజ్ఞప్తి

Date : 04 May 2026 07:44 PM Views : 210

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తప్పుడు పత్రాలు సృష్టించి మా స్థలాలపై కన్నేశారు - మా తాత్కాలిక కట్టడాలను కూల్చివేశారు - న్యాయం చేయాలంటూ అధికారులకు బాధితులు విజ్ఞప్తి - స్థలం వద్దకు వెళ్లి పరిశీలించిన రెవెన్యూ అధికారులు మదనపల్లె : పట్టణంలోని బైపాస్ రోడ్డు,శ్రీదేవి గార్డెన్స్ పక్కన ఉన్న సర్వే నెంబర్ 67 నందు 1997లో 1.55 సెంట్ల భూమిని తాము 44 మంది శ్రీ చౌడేశ్వరి మహిళా సేవా సొసైటీ నుండి కొనుగోలు చేయడం జరిగిందని,అయితే అప్పటి పరిస్థితుల ప్రభావం వల్ల ఇళ్లను నిర్మించుకోలేకపోయామని బాధితులు తెలిపార.అయితే ఈ మధ్యకాలంలో ఆలూరి సుధాకర్ బాబు,జింకా నరసింహులు అనేవారు యర్రపురెడ్డి అనే వ్యక్తి దగ్గర వారు సదరు భూమిని కొనుగోలు చేసినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారని బాధితులు ఆరోపించారు.ఆ భూమి వారికే వర్తిస్తుందని 2011లో కోర్టు నుండి అసలు హక్కుదారులైన మాకు నోటీసులు పంపించారన్నారు.తాము సైతం కోర్టును ఆశ్రయించగా మా రిజిస్ట్రేషన్ పత్రాలు పరిశీలించి 20 మందికి ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిందన్నారు.ఇదిలా ఉండగా మా స్థలాల్లో మేము తాత్కాలికంగా ఇళ్లను నిర్మించుకుంటుంటే వారి అనుచరులు,ప్రజాసంఘాల వారిని పురమాయించి నిర్మాణాలను తొలగించి మాపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై పీజీఆర్ఎస్ నందు ఫిర్యాదు చేయడం జరిగిందని,అదేవిధంగా మా స్థలాల్లో టెంట్ ఏర్పాటు చేసి నిరసన తెలిపామన్నారు.ఇదిలా ఉండగా సోమవారం ఇన్చార్జి తహసిల్దార్ వెంకటస్వామి,ఆర్.ఐ బాలసుబ్రమణ్యం,సర్వేయర్ సుబ్రహ్మణ్యంలు సదరు స్థలానికి వెళ్లి బాధితుల వివరణ తీసుకున్నారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఇరువర్గాల వారి పత్రాలను పరిశీలించి నివేదికను జిల్లా కలెక్టరుకి పంపించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.ఆలూరి సుధాకర్ బాబు,జింకా నరసింహులు నుండి మాకు రక్షణ కల్పించి,మా స్థలాలను మాకు ఇప్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :