నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 19 ః కిషోర్ బాలికలు తమ రక్షణ కోసం చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ రమణమ్మ సూచించారు. మంగళవారం మండలంలోని గోపి దిన్నె పంచాయతీ ఉప్పులూరు వాండ్లపల్లె అంగన్వాడి లో కిషోర్ వికాసం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలు చదువు పట్ల శ్రద్ధ చూపి ఉన్నత స్థాయికి ఎదగడానికి కృషి చేయాలన్నారు. బాలికలు చదివి ఉన్నత స్థాయికి చేరిన మహిళలను ఉదాహరణగా వివరించారు. బాలికల నడవడిక పై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని వారు అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి సహకరించాలన్నారు.ఈ సందర్భంగా డిపి సిడబ్ల్యు షకీలా మాట్లాడుతూ పోప్ షోకేస్ కుర్చీ పై బాలికలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. చట్టాల వల్ల లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరిగిన వెంటనే వారిపై కఠిన శిక్షలు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు, కిశోర బాలికలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు
Reporter
Namitha News