Monday, 27 July 2026 12:10:07 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ మరియు హార్డ్‌వేర్ రంగాల్లో కెరీర్ ఉద్యోగ అవకాశాల పై ఉపన్యాసం

Date : 09 January 2026 08:45 PM Views : 169

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 09 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం వారు మిట్స్ అల్యూమిని రిలేషన్స్ ఆధ్వర్యంలో ఈ.సి.ఈ విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ మరియు హార్డ్‌వేర్ రంగాల్లో కెరీర్ ఉద్యోగ అవకాశాలు” అనే అంశంపై అతిధి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మిట్స్ పూర్వ విద్యార్థి దేవరావుల శివమణి పాల్గొని, ప్రముఖ సాఫ్ట్‌వేర్ మరియు హార్డ్‌వేర్ సంస్థలయిన రేవచర్, సుమెరు డిజిటల్ సొల్యూషన్స్, హెచ్.సి.ఎల్‌ సంస్థల్లో ఎంపికై ఉద్యోగాలు సాధించిన తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ.సి.ఈ విద్యార్థులకు సాఫ్ట్‌వేర్‌తో పాటు హార్డ్‌వేర్ రంగాలలో విస్తృతమైన ఉద్యోగావకాశాలు ఉన్నాయని తెలిపారు. పైథాన్, జావా, ఫుల్ స్టాక్, వి.ఎల్.ఎస్.ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎస్‌క్యూఎల్ వంటి కోర్సులపై నైపుణ్యం సాధిస్తే మంచి కంపెనీలలో ఉద్యోగాలు పొందడం సాధ్యమని సూచించారు. చదువుతో పాటు నిరంతరం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం ఎంతో అవసరమని ఆయన తెలిపారు. అల్యూమ్ని రిలేషన్ ఆఫీసర్ డాక్టర్ జి. నాగశ్వేత మాట్లాడుతూ శివమణి లాంటి పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకోవడం వల్ల ప్రస్తుత విద్యార్థులకు స్పష్టమైన కెరీర్ దిశ లభిస్తుందని, మిట్స్ యాజమాన్యం విద్యార్థులను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ రాజశేఖరన్ విభాగ అధ్యాపకులు, కోఆర్డినేటర్ జి. చరణ్ కుమార్, శివమణి తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :