నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 09 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం వారు మిట్స్ అల్యూమిని రిలేషన్స్ ఆధ్వర్యంలో ఈ.సి.ఈ విద్యార్థులకు సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ రంగాల్లో కెరీర్ ఉద్యోగ అవకాశాలు” అనే అంశంపై అతిధి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మిట్స్ పూర్వ విద్యార్థి దేవరావుల శివమణి పాల్గొని, ప్రముఖ సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ సంస్థలయిన రేవచర్, సుమెరు డిజిటల్ సొల్యూషన్స్, హెచ్.సి.ఎల్ సంస్థల్లో ఎంపికై ఉద్యోగాలు సాధించిన తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ.సి.ఈ విద్యార్థులకు సాఫ్ట్వేర్తో పాటు హార్డ్వేర్ రంగాలలో విస్తృతమైన ఉద్యోగావకాశాలు ఉన్నాయని తెలిపారు. పైథాన్, జావా, ఫుల్ స్టాక్, వి.ఎల్.ఎస్.ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎస్క్యూఎల్ వంటి కోర్సులపై నైపుణ్యం సాధిస్తే మంచి కంపెనీలలో ఉద్యోగాలు పొందడం సాధ్యమని సూచించారు. చదువుతో పాటు నిరంతరం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం ఎంతో అవసరమని ఆయన తెలిపారు. అల్యూమ్ని రిలేషన్ ఆఫీసర్ డాక్టర్ జి. నాగశ్వేత మాట్లాడుతూ శివమణి లాంటి పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకోవడం వల్ల ప్రస్తుత విద్యార్థులకు స్పష్టమైన కెరీర్ దిశ లభిస్తుందని, మిట్స్ యాజమాన్యం విద్యార్థులను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ రాజశేఖరన్ విభాగ అధ్యాపకులు, కోఆర్డినేటర్ జి. చరణ్ కుమార్, శివమణి తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News