నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జూన్ 24 : తంబళ్లపల్లె మండలం ముద్దలదొడ్డి (బాలిరెడ్డిగారిపల్లి) రైతు సేవా కేంద్రంలో రైతులకు టిడిపి పార్లమెంట్ రైతు నాయకుడు వెంకటరెడ్డి వేరుశనగ విత్తన కాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం లో రైతులకు అన్నదాత సుఖీభవ అందించామని త్వరలో హంద్రీనీవా తో సాగునీరు, తాగునీటికి జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి స్వచ్ఛనీరు అందించి ప్రజల మన్ననలు పొందుతామన్నారు. ఏ ఈ ఓ మాట్లాడుతూ రైతులు కే సిక్స్ విత్తన కాయలు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యంగా సస్యరక్షణ పాటించాలని సూచించారు.ఈ పంపిణీ కార్యక్రమంలో టిడిపి, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు
Reporter
Namitha News