Sunday, 26 July 2026 12:20:56 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

బహుదా కాలువపై ఛత్రపతి విగ్రహా ఏర్పాటు సబబు కాదు - అధికారులు దీనికి అనుమతులు ఎలా ఇచ్చారు - శివాజీ విగ్రహాన్ని మరోచోట ఏర్పాటు చేయాలి

Date : 26 June 2026 09:16 PM Views : 62

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బహుదా కాలువపై ఛత్రపతి విగ్రహా ఏర్పాటు సబబు కాదు - అధికారులు దీనికి అనుమతులు ఎలా ఇచ్చారు - శివాజీ విగ్రహాన్ని మరోచోట ఏర్పాటు చేయాలి - వాల్మీకి జనసైనిక్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముత్తరాశి హరికృష్ణ డిమాండ్ మదనపల్లె : అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణ నడిబొడ్డున ప్రవహిస్తున్న బహుదా కాలువపై ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు సబబు కాదని వాల్మీకి జనసైనిక్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముత్తరాశి హరికృష్ణ పేర్కొన్నారు.శుక్రవారం చిత్తూరు బస్టాండ్ వాల్మీకి కూడలి వద్ద వాల్మీకి సంఘాల నాయకులతో కలిసి వాల్మీకి మహర్షి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ముత్తరాశి హరికృష్ణ మాట్లాడుతూ తాము చత్రపతి శివాజీకి,ఆ కులానికి వ్యతిరేకం కాదన్నారు.నాడు శివాజీ మొగల్ చక్రవర్తులతో పోరాటం చేసే రోజుల్లో బోయ భీమన్న ఆయనకు చేదోడు,వాదోడుగా నిలిచారని గుర్తుచేశారు.అయితే బహుదాకాలువపై అక్రమ కట్టడాలు నిర్మించరాదని ప్రభుత్వం స్పష్టమైన జీవో ఇచ్చిందని,అయితే ఛత్రపతి విగ్రహ ఏర్పాటుకు ఎవరు అనుమతులు ఇచ్చారని సూటిగా ప్రశ్నించారు.బహుదా కాలువ మొత్తం 25 చెరువులతో అనుసంధానం కలిగి ఉందని 1996 జూన్ 14న ఆకస్మిక వరదలు సంభవించడంతో సుమారు 30 వాల్మీకి కుటుంబాలు గల్లంతయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని అక్కడి నుండి మరోచోటికి తరలించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి,రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి,జిల్లా కలెక్టర్,మున్సిపల్ అధికారులకు వాల్మీకి సంఘాలు వినతి పత్రాలు సమర్పించడం జరిగిందన్నారు.కొన్ని దశాబ్దాలుగా వాల్మీకి కూడలిగా ఇది ప్రసిద్ధిగాంచిందన్నారు.అయితే వాల్మీకుల తెలియజేస్తున్న నిరసనలను కొందరు అధికారులు తేలికగా తీసుకుంటున్నారని,వారు తేరుకోకపోతే మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు.అదేవిధంగా కూటమి పార్టీల నాయకులు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని,లేనిపక్షంలో వాల్మీకులు వారికి దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఇప్పటికైనా దీనిపై అధికారులు,ప్రభుత్వ పెద్దలు స్పందించి చత్రపతి శివాజీ విగ్రహాన్ని మరోచోటి ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘాల నాయకులు పూలకుంట్ల హరిబాబు,మేకల విజయ మోహన్,విష్ణు చైతన్య,వేణు,రామకృష్ణ,నరసింహ,శంకర,రాజేష్,తేజ సూరి తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: