నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 06 : దక్షిణ భారతదేశం అంతటా సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన, ఎర్రచందనంతో తయారు చేసిన శతాబ్దాల నాటి తిరుపతి జిల్లాలోని లక్ష్మీగారిపల్లి రాజా-రాణి చెక్క బొమ్మలకు మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, మదనపల్లె లోని మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (MITS-IPFC) వారు భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్ కోసం చెన్నై జీఐ రిజిస్ట్రీకి సమర్పించినట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ అన్నారు. లక్ష్మీగారిపల్లి బొమ్మలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు కర్ణాటకలో ప్రసిద్ధి చెందాయి అని మరియు సాంప్రదాయకంగా పెళ్లికూతుళ్లకు వివాహ బహుమతిగా ఇస్తారు అనిఇవి వారి బొమ్మల కొలువు సేకరణలో మొదటి భాగంగా ఉంచుతారని ఆయన అన్నారు. రిజిస్ట్రీకి సమర్పించిన పత్రాల ప్రకారం, లక్ష్మీగారిపల్లి రాజా-రాణి చెక్క బొమ్మల కళ తిరుపతి జిల్లాలోని సెట్టిగుంట పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది అని, ఈ జీఐ దరఖాస్తును శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆర్టిస్టిక్ వుడెన్ టాయ్స్ వర్కర్స్ ఇండస్ట్రియల్ కో-ఆపరేటివ్ సొసైటీ పేరు పై దాఖలు చేసినట్లు ఆయనన్నారు. ఈ సందర్బంగా యూనివర్సిటీ మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ (MITS-IPFC) మరియు మిట్స్ ఆర్ & డి సెల్ యొక్క చురుకైన ప్రయత్నాలను మిట్స్ యూనివర్సిటీ వ్యవస్థాపక ఛాన్సలర్ డాక్టర్ ఎన్. విజయ భాస్కర్ చౌదరి అభినందించారు. ఈ కార్యక్రమం లో అడ్విసెర్ (ఆర్ &డి) డాక్టర్ తులసిరామ్ నాయుడు, అసోసియేట్ డీన్ (ఆర్ &డి) డాక్టర్ పి. శివయ్య, అధ్యాపక సభ్యులు పాల్గొన్నారు
Admin
Namitha News