నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 07 ః తంబళ్లపల్లె నియోజకవర్గానికి తలమానికంగా నిలిచిన మల్లయ్య కొండ బైపాస్ రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని శివ భక్తులు, ప్రజలు కోరుతున్నారు. ప్రతిరోజు మల్లయ్య కొండకు వేలాదిగా భక్తులు మల్లయ్య కొండ మహా శివుని దర్శనానికి వస్తుంటారు. తంబళ్లపల్లి ఆర్టీసీ బస్టాండ్ నుండి ఆర్టీసీ బస్సులు పాత బస్టాండ్ రాగి మాను రచ్చ రహదారి గుండా కొండకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో అక్కమ్మ చెరువు కట్టమీదుగా బైపాస్ రోడ్డు ద్వారా ఆర్టీసీ బస్టాండ్ కు చేరుకుంటుంది. మల్లయ్య కొండకు వెళ్లే అక్కమ్మ చెరువు కట్టపై పిచ్చి మొక్కలు పెరిగి రోడ్డు గుంతల మయమైంది. ఆర్టీసీ బస్టాండ్ నుండి మల్లయ్య కొండ రహదారితో పాటు తంబళ్లపల్లె సచివాలయం, విద్యుత్ సబ్స్టేషన్, కాలనీ లేఅవుట్, ఇట్నేని వారి పల్లి,బీసీ గురుకుల పాఠశాల నిర్మాణ స్థలం వరకు రోడ్డు, సాయిబాబా గుడి నుండి ఎమ్మెల్యే స్వగృహం, పిఆర్ గెస్ట్ హౌస్ (ప్రస్తుత తాసిల్దార్ కార్యాలయం) మీదుగా క్రాస్ రోడ్డు వరకు మరమ్మతులు చేపడితే రోడ్లు ప్రజలకు, భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు
Reporter
Namitha News