నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 01 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ విద్యార్థులు చెన్నై కి చెందిన జెనోవెక్స్ టెక్నాలజీస్ నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ఎక్స్ హ్యాకథాన్-2025 (Xackathon–2025) కార్యక్రమంలో పాల్గొని ప్రతిభ చూపారని ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ నందు ఇంజనీరింగ్ సి.ఎస్.ఈ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్) తృతీయ సంవత్సరం చదువుతున్న మోహన్ కృష్ణ, వర్ధన్ కుమార్, శణ్ముఖ సాయి మరియు మోహిత్ లు మరియు విష్ణు వర్ధన్ సి.ఎస్.ఈ (నెట్వర్క్స్), తో కూడిన బృందం తమ వినూత్న ఆలోచనలు, సాంకేతిక నైపుణ్యం మరియు సమన్వయంతో పోటీలో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి ద్వితీయ బహుమతి గా రూ.10,000 నగదు అందుకున్నారు. ఈ పోటీలో ప్రత్యేక ప్రతిభకు గుర్తింపుగా విష్ణు వర్ధన్కు స్పెషల్ పెరఫార్మర్ అవార్డు (అమెజాన్ వౌచర్) మరియు మోహన్ కృష్ణకు ఆక్టివ్ పెరఫార్మర్ అవార్డు (అమెజాన్ వౌచర్) లను మరియు ప్రసంశా పాత్రలను జెనోవెక్స్ కంపెనీ ప్రతినిధులు అందజేశారు. కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులను యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ యెన్.విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ యన్.ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ, విభాగాధిపతి డాక్టర్ ఎస్.పద్మ మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు
Reporter
Namitha News