నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 16 : తంబళ్లపల్లె మండలంలో శుక్రవారం సంక్రాంతి పండుగలో భాగమైన కనుమ పండుగ స్థానిక గ్రామీణ ప్రాంత పాడి రైతులు, ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఏడాది పొడవునా వేసి పశువులు సేద్యం లో సహాయపడిన పశువులు, పాల ఉత్పత్తితో కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలబడిన పాడి ఆవులను శుభ్రం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి సుందరంగా అలంకరించి గ్రామాల పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గ్రామ శివార్ల లోని చిట్లకుప్ప వద్దకు పశువులను తీసుకెళ్లి కాటమరాజు విగ్రహానికి పూజలు నిర్వహించి పాడి పశువులు అభివృద్ధి చెంది పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు. అనంతరం చిట్ల కుప్పకు నిప్పు పెట్టి ఆ మంటలు చుట్టూ మూడు మార్లు ప్రదక్షిణలు చేయించి పశువులను ఇండ్లకు తరలించారు
Reporter
Namitha News