నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 09 : నేటి పర్యావరణం కాలుష్య నివారణకు భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయమే రైతులకు ప్రగతి సోపానాలుగా నిలుస్తాయని ఎపిఎం గంగాధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ రఘునాథ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై మహిళా సంఘాలకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఏవో థామస్ రాజా ప్రతి ఒక్కరికి ప్రకృతి వ్యవసాయ పంటల ఆహారమే ఆరోగ్యకరమన్నారు. రఘునాథ్ ప్రకృతి వ్యవసాయ ప్రాముఖ్యత, నీరు, పర్యావరణ పరిరక్షణ, వనరుల ఉపయోగం, ఆరోగ్యకరమైన ఆహారం పై సుదీర్ఘ సలహాలు, సూచనలు చేశారు. ప్రకృతి వ్యవసాయం లో ద్రవ, ఘన, బీజామృతాలు, పంచ గవ్య, దశ పత్రి అర్క, సేంద్రీయ ఎరువు, పచ్చ రొట్టి ఎరువులు, అచ్ఛాదన, వాఫాసాల ద్వారా తయారయ్యే ప్రకృతి సిద్ధ ఎరువులు,తయారీపై విశదీకరించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం లో క్రిమిసంహారకాలు నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నస్త్రం,దళపతిఅర్క, గోమూత్రం లతో కషాయాలు తయారుచేసి ప్రయోగాత్మకంగా చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో పాల డైరీ ఏపిఎం సుజాత, పోర్డు సంస్థ ప్రతినిధి రమణ,ఎన్ఎఫ్ఏ సునీత, ఎఫ్ ఎం టి రాజు, ఎన్ ఎఫ్ ఎఫ్ రుక్మిణి, ఐ సి ర్ పిలు నిజాముద్దీన్, రెడ్డప్ప, శారద, సిద్ధమల్లు, సుజాత, సునీత, పద్మజ, సుకన్య, అర్షియాభాను, బయ్యమ్మ, సిసిలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, సంఘ మిత్రలు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Reporter
Namitha News