Monday, 27 July 2026 01:16:58 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

సాహితీ శిఖరం సరస్వతీ పుత్రుడు పుట్టపర్తి నారాయణాచార్యులు - ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

జిల్లా పోలీస్ శాఖ తరపున పుట్టపర్తి నారాయణ ఆచార్యులకు ఘన నివాళులు

Date : 28 March 2026 11:11 PM Views : 184

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 28 : సాహితీ దిగ్గజం, పద్మశ్రీ డాక్టర్ పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి వేడుకలను అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పుట్టపర్తి నారాయణ ఆచార్యుల చిత్రపటానికి పూలమాల వేసి, పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ తెలుగు సాహిత్య రంగంలో పుట్టపర్తి నారాయణాచార్యులు ఒక ధృవతార అని వ్యాఖ్యానిస్తూ 14 భాషల్లో ప్రావీణ్యం సంపాదించి 'సరస్వతీ పుత్ర' బిరుదును సార్థకం చేసుకున్న మహనీయులు. అనంతపురం జిల్లాలోని చియ్యేడు గ్రామంలో జన్మించారు. అయితే, వీరి విద్యాభ్యాసం మరియు సాహిత్య ప్రస్థానం ఎక్కువగా ప్రొద్దుటూరు (కడప జిల్లా) ప్రాంతంతో ముడిపడి ఉంది. ఈయన మన ప్రాంతానికి చెందిన వారు కావడం మనందరికీ గర్వకారణం. ఆయన రచించిన 'శివతాండవం' వంటి కావ్యాలు తెలుగు సాహిత్యానికి వెలకట్టలేని ఆభరణాలు. అటువంటి గొప్ప వ్యక్తి ఆశయాలను స్మరించుకోవడం, వారి స్ఫూర్తిని నేటి తరానికి అందించడం మన బాధ్యత." అని పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో ఎస్బి సీఐ పి. రాజా రమేష్ గారు ఆర్ఐ కె. సురేష్ కుమార్ రెడ్డి ఇతర పోలీస్ అధికారులు, పోలీసు సిబ్బంది కార్యాలయ సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: