నమిత న్యూస్ - Andhra Pradesh / శ్రీ బాలాజీ ( తిరుపతి ) : శ్రీకాళహస్తి - నవంబర్ 06 : రోజు రోజుకు మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి అనడానికి ఉదాహరణగా గురువారం శ్రీకాళహస్తి లో ఓ ఘటన పలువురి హృదయాలను కలసివేసింది. 39 సంవత్సరాల పాటు అనేక మందికి విద్యాబోధన చేసిన ఓ మహిళా ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి 77సంవత్సరాలు , వృద్ధాప్యం అనారోగ్యం తో నేడు మృతి చెందింది. అయితే ఆమె మృతదేహాన్ని కష్టపడి ఆమె కట్టుకున్న సొంత ఇంట్లో నుండి సాగనం పాలనే కోరికను తీర్చలేని పరిస్థితి అక్కడ నెలకొంది. చనిపోయిందని ఆమె మృతదేహాన్ని తీసుకుని ఇంటి దగ్గరకు వస్తే మృతదేహాన్ని లోపలికి రానీకుండా నిర్ధాక్షణంగా తలుపులు మూసి మృతదేహాన్ని రోడ్డు మీదే ఉంచేసింది కోడలు. అత్యంత రద్దీ గల పెళ్లి మండపం నుండి వైఎస్ఆర్ విగ్రహానికి వెళ్లే మధ్య మార్గంలో రిలయన్స్ మార్ట్ ఎదురుగా రోడ్డు మీదే మృతదేహాన్ని పెట్టి కొడుకు మనవరాలు ఆవేదన వ్యక్తం చేస్తూ నిరీక్షణ చేస్తున్నారు. కొడుకు సురేష్ భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదం తో కోడలి సూటిపోటి మాటలు భరించలేక సురేష్ , తల్లిని తీసుకొని మనవరాలను చదివించుకుంటూ పుత్తూరులో ఉంటున్నారు. అయితే రమాదేవి తర్వాత మృతి చెందింది. ఈ నేపథ్యంలో సొంత ఇంట్లో ఉంచి తన పార్దీవ దేహాన్ని అంతిమయాత్ర నిర్వహించాలని ఆమె చివరి కోరిక తీర్చడానికి కొడుకు తన సొంత ఇంటికి తీసుకుని వచ్చాడు . కానీ ఆ కోడలు ఆమె మృతదేహాన్ని లోపలికి రానీకుండా తలుపులు బిగించి లోపల కూర్చున్నది. వారికి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొడుకు సురేష్, మనవరాలు రేష్మ రోడ్డు మీద రోదిస్తున్నారు. తన తల్లి సొంత ఇంటిలోకే ఆమె మృతదేహాన్ని తీసుకోలేకపోతున్నామని కొడుకు మనవరాలు పడుతున్న ఆవేద జనాలని కలచివేస్తుంది. దీనిపైన అధికారులు వెంటనే స్పందించి ఆమె మృతదేహాన్ని సొంత ఇంట్లో ఉంచి అ అంతిమ యాత్ర చేసే ఏర్పాటు చేయాలని . కొడుకు సురేష్ కోరుతున్నారు.
Reporter
Namitha News