నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 18 ః ఉపాధి హామీ పనులతో జీవనం సాగించే ఓ దళిత కూలి వడదెబ్బ తగిలి తీవ్ర అస్వస్థతకు గురై మృత్యువాత పడిన విషాదకర సంఘటన గోపి దిన్నె పంచాయతీలో వెలుగు చూసింది. మండలంలోని గోపి దీన్నే పంచాయితీ దళిత వాడకు చెందిన అలిగింటి శ్రీనివాసులు (45)ది నిరుపేద కుటుంబం. ఉపాధి హామీ కరువు పనులకు వెళ్లి తన భార్య గౌరమ్మ తో పాటు ముగ్గురు సంతానాన్ని పోషిస్తున్నాడు. ప్రతిరోజు ఉపాధి పనికి వెళ్లే శ్రీనివాసులు సోమవారం సైతం ఉపాధి పనులకు వెళ్ళాడు. అక్కడ పనిచేస్తుండగా హఠాత్తుగా వడదెబ్బ తగిలి అపస్మార్క స్థితికి చేరుకున్నాడు. హుటాహుటిన సహచర కూలీలు సపర్యలు చేసి చికిత్సలకు తరలించడానికి ప్రయత్నించగా అప్పటికే శ్రీనివాసులు మృతి చెందాడు. కుటుంబాన్ని పోషించే పెద్దదిక్కు కోల్పోవడంతో భార్య, ముగ్గురు పిల్లలు ఇక మమ్మలను ఆదుకునే దిక్కెవరిని కన్నీరు మున్నీరుగా విలపించారు. శ్రీనివాసుల కాయ కష్టంతో జీవనం సాగించే ఆ కుటుంబం నేడు ఆశ్రయం కోల్పోయి బజారున పడిందని ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని సర్వత్ర కోరుతున్నారు. శ్రీనివాసులు కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వంతో కార్యకర్త గా పనిచేస్తున్నాడు. శ్రీనివాసుల కుటుంబాన్ని పార్టీ పరంగా ఆదుకోవడానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు
Reporter
Namitha News