Sunday, 26 July 2026 09:52:15 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

వడదెబ్బకు ఉపాధి హామీ దళిత కూలి అకాల మరణం

ఆశ్రయం కోల్పోయిన కుటుంబం

Date : 18 May 2026 07:57 PM Views : 159

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 18 ః ఉపాధి హామీ పనులతో జీవనం సాగించే ఓ దళిత కూలి వడదెబ్బ తగిలి తీవ్ర అస్వస్థతకు గురై మృత్యువాత పడిన విషాదకర సంఘటన గోపి దిన్నె పంచాయతీలో వెలుగు చూసింది. మండలంలోని గోపి దీన్నే పంచాయితీ దళిత వాడకు చెందిన అలిగింటి శ్రీనివాసులు (45)ది నిరుపేద కుటుంబం. ఉపాధి హామీ కరువు పనులకు వెళ్లి తన భార్య గౌరమ్మ తో పాటు ముగ్గురు సంతానాన్ని పోషిస్తున్నాడు. ప్రతిరోజు ఉపాధి పనికి వెళ్లే శ్రీనివాసులు సోమవారం సైతం ఉపాధి పనులకు వెళ్ళాడు. అక్కడ పనిచేస్తుండగా హఠాత్తుగా వడదెబ్బ తగిలి అపస్మార్క స్థితికి చేరుకున్నాడు. హుటాహుటిన సహచర కూలీలు సపర్యలు చేసి చికిత్సలకు తరలించడానికి ప్రయత్నించగా అప్పటికే శ్రీనివాసులు మృతి చెందాడు. కుటుంబాన్ని పోషించే పెద్దదిక్కు కోల్పోవడంతో భార్య, ముగ్గురు పిల్లలు ఇక మమ్మలను ఆదుకునే దిక్కెవరిని కన్నీరు మున్నీరుగా విలపించారు. శ్రీనివాసుల కాయ కష్టంతో జీవనం సాగించే ఆ కుటుంబం నేడు ఆశ్రయం కోల్పోయి బజారున పడిందని ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని సర్వత్ర కోరుతున్నారు. శ్రీనివాసులు కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వంతో కార్యకర్త గా పనిచేస్తున్నాడు. శ్రీనివాసుల కుటుంబాన్ని పార్టీ పరంగా ఆదుకోవడానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :