నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మన పథం అభివృద్ధి, మన లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సిఎం చేయడమే -- నిమ్మనపల్లె వైసిపి నాయకులతో సమావేశమైన నిసార్ అహ్మద్... వివాదంపై ఆరా... నాయకులకు అండగా వుంటామని భరోసా... అనవసర వివాదాలకు దూరంగా వుందాం, కూటమి పెట్టే అక్రమ కేసులకు తావివ్వకుండా వుండాలని నిమ్మనపల్లె వైసిపి నాయకులకు నిసార్ అహ్మద్ సూచించారు. మంగళవారం నిమ్మనపల్లెలో వైసిపి నాయకులతో నిసార్ అహ్మద్ సమావేశమై ఆదివారం రాత్రి జరిగిన ఫ్లెక్సీల వివాదంపై ఆరా తీశారు. జరిగిన ఘటనపై పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పెద్ద సంఖ్యలో వైసిపి నాయకులు, కార్యకర్తలు హజరైనారు. నిసార్ అహ్మద్ కు సాదర స్వాగతం పలికారు. నాయకులను పలకరించి, యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం నిమ్మనపల్లెలో జరిగిన ఫ్లెక్సీల వివాదంపై నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ జగన్ 2.0 లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తారు. గతంలో జగన్మోహన్ సిఎంగా అందించిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు తెలియజేయాలని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు వివరించాలని సూచించారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి సిఎం కావాలని అందుకోసం అందరూ కలిసి పని చేద్దామని అన్నారు. చిన్ని, చిన్న వివాదాల కారణంగా కేసులు నమోదు అయ్యేలా చూసుకోవడం, తద్వారా కార్యకర్తలు, నాయకులు ఇబ్బందులు కలిగి విధంగా చేయవద్దని సూచించారు. ఇప్పుడు కూటమి పాలనలో ఇబ్బందులు పడే కార్యకర్త, నాయకుల వివరాలు డిజిటల్ బుక్ లో నమోదు చేయడం జరుగుతుందని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటానే వారికి సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని తెలిపారు. మన పథం అభివృద్ధి అని, మన లక్ష్యం మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని సిఎం చేయడమే అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి మళ్ళీ వైసిపి ప్రభుత్వామే రావాలని ప్రజలు కోరుతున్నారని, ఇందుకు అనుగుణంగా మనం ప్రజలకు చేరువ కావాలని వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు రెడ్డి, రమణా రెడ్డి, రెడ్డిశేఖర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, హేమంత్, జయప్రకాష్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, దయాకర్ రెడ్డి, రఫీ , షరాఫత్, నూర్ మొహిద్దీన్, నాగరాజ్, వెంగంవారిపల్లి శ్రీనివాసులు రెడ్డి, వెంగంవారిపల్లె, దావూద్, శ్రీనివాసులు రెడ్డి, హోటల్ రఫీ, నరేష్, యోగానంద రెడ్డి పాల్గొన్నారు.
Reporter
Namitha News