నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఫిబ్రవరి 23 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు స్టూడెంట్ వెల్ఫేర్ సెల్ ఆధ్వర్యంలో “విదేశాలలో ఉన్నత విద్య కార్యక్రమాల కోసం యూనివర్సిటీ వారి ప్రైవేట్ స్కాలర్షిప్స్” అనే అంశంపై అవగాహన కార్యక్రమంను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తిరుపతికి చెందిన ఎమ్.ఎస్ అబ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మురళీకృష్ణ పురాణం పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని ఆశించే విద్యార్థులకు ప్రత్యక్షంగా విదేశీ విశ్వవిద్యాలయాలు అందించే స్కాలర్షిప్ లు అందిస్తున్నాయని అన్నారు. విద్యార్థుల విద్యార్హతలు, ఆసక్తి మరియు కెరీర్ లక్ష్యాలను బట్టి సరైన యూనివర్సిటీ మరియు కోర్సు ఎంపికలో సహకరిస్తామని, అలాగే వీసా డాక్యుమెంటేషన్, ఇంటర్వ్యూ సన్నాహాలు తన కన్సల్టెన్సీ ద్వారా అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉన్నత విద్యలో అధునాతన తయారీ సాంకేతికతలు, రోబోటిక్స్, ఆటోమొబైల్, ఏరోస్పేస్ వంటి ప్రత్యేక విభాగాల్లో నైపుణ్యం పొందడానికి విదేశీ విశ్వవిద్యాలయాలు స్కాలర్షిప్లు, స్టైపెండ్లు ద్వారా అవకాశాలను కల్పిస్తున్నాయని తెలిపారు.. ఆధునిక ప్రయోగశాలలు, పరిశోధన సదుపాయాలు మరియు పరిశ్రమలతో అనుసంధానం ద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి జ్ఞానం లభిస్తుందని అన్నారు. విదేశాల్లో ఇంజనీరింగ్లో ఉన్నత విద్య అభ్యసించడం వల్ల ప్రపంచ స్థాయి కెరీర్ అవకాశాలు, పరిశోధన మరియు ఇన్నోవేషన్లో పాల్గొనే అవకాశం, మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందడానికి విద్యార్థులు సరైన ప్రణాళికతో ముందుకు సాగడం అవసరం అని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, సీనియర్ మేనేజర్-స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ పి. అథాహర్ సమీనా ఖాన్, రాగ దీప్తి మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Admin
Namitha News