Sunday, 26 July 2026 04:34:50 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

ట్రైబల్ కుటుంబాలకు అండగా స్వచ్ఛంద సంస్థలు

పలమనేరులో 30 మంది ప్రత్యేక ప్రతిభావంతులు, గిరిజనులకు నిత్యావసర సరుకుల పంపిణీ

Date : 21 May 2026 04:07 PM Views : 77

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ట్రైబల్ కుటుంబాలకు అండగా స్వచ్ఛంద సంస్థలు పలమనేరులో 30 మంది ప్రత్యేక ప్రతిభావంతులు, గిరిజనులకు నిత్యావసర సరుకుల పంపిణీ : సేవే లక్ష్యంగా పనిచేస్తున్న స్వదిష్ట అన్న ప్రసాద ట్రస్ట్, ధాత్రి ఫౌండేషన్ సంస్థలు పలమనేరులో 30 మంది గిరిజనులు, ప్రత్యేక ప్రతిభావంతులకు నెలసరి నిత్యావసర సరుకులను పంపిణీ చేశాయి. పలమనేరు పరిసర గ్రామాలకు చెందిన లబ్ధిదారులు సరుకులు అందుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో ఉపాధి అవకాశాలు లేక జీవనం కష్టతరంగా మారుతోందన్నారు. కుటుంబ సభ్యులందరికీ కూలీ పనులు కూడా దొరకక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ సరుకులు రెండు నెలల పాటు ఉపయోగపడతాయని తెలిపారు. తమ సమస్యలను గుర్తించి తిరుపతి నుంచి స్వదిష్ట అన్న ప్రసాద ట్రస్ట్, మదనపల్లి నుంచి ధాత్రి ఫౌండేషన్ వచ్చి సహాయం అందించడం ఆనందంగా ఉందని కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆశాజ్యోతి పూర్ పీపుల్స్ సొసైటీ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ ధాత్రి ఫౌండేషన్, స్వదిష్ట స్వచ్ఛంద సంస్థలు సేవా దృక్పథంతో పనిచేస్తున్నాయని కొనియాడారు. పలమనేరు మండలంలో ఈ సంస్థలు నిర్వహించే సేవా కార్యక్రమాలకు తమ బృందం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ధాత్రి ఫౌండేషన్, స్వదిష్ట స్వచ్ఛంద సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ స్వాతి చక్రపాణి, శ్రీమతి విజయ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు ఒక గ్రామానికి, ఒక ప్రాంతానికే పరిమితం కాకూడదన్నారు. అవసరం, అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పేద ప్రజలకు సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఎంత దూరమైనా వెళ్లి అవసరమైన వారికి సహాయం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆశాజ్యోతి పూర్ పీపుల్స్ సొసైటీ సభ్యులు, వాలంటీర్లు, స్థానిక గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: