Sunday, 26 July 2026 12:23:36 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

మిట్స్ విద్యార్థుల ఆత్మీయ సమావేశం

Date : 04 April 2026 10:03 PM Views : 112

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 04 ::అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు నందు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం మరియు మిట్స్ అల్యూమిని వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ నందు 2018 మరియు 2025 సంవత్సరంలో చదువుకున్నపూర్వ విద్యార్థులు హాజరైనారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్ధి సయ్యద్ మాజ్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు మరియు ప్రస్తుత విద్యార్థుల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడంలో అల్యూమిని పోర్టల్ మరియు లింక్డ్ఇన్ వంటి వేదికలు ముఖ్య పాత్ర పోషిస్తాయని అన్నారు. అల్యూమిని పోర్టల్ ద్వారా పూర్వ విద్యార్థుల వివరాలు ఒకే వేదికలో అందుబాటులో ఉండటంతో, వారితో సులభంగా సంబంధాలు ఏర్పరచుకోవచ్చు అని అన్నారు. ఉద్యోగ అవకాశాలు, ఇంటర్న్‌షిప్‌లు, మెంటారింగ్ వంటి అనేక అవకాశాలు విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అలాగే లింక్డ్ఇన్ ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాలు, ప్రాజెక్టులు, విజయాలను ప్రపంచానికి పరిచయం చేసుకొని, పరిశ్రమ నిపుణులతో నెట్‌వర్క్ పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ వేదికలను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా విద్యార్థులు తమ కెరీర్ అభివృద్ధిని వేగవంతం చేసుకోవడంతో పాటు భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి.నాగ శ్వేతా మాట్లాడుతూ అల్యూమిని మరియు యూనివర్సిటీ మధ్య బలమైన అనుబంధం కొనసాగితే విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని, సమాజానికి ఉపయోగపడే నాణ్యమైన ఇంజినీర్లను తయారు చేయడం సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొని తమ అనుభవాలను ప్రస్తుత విద్యార్థులతో పంచుకున్నారు. సంస్థతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, విద్యార్థి దశలో పొందిన విద్య, మార్గదర్శకం తమ వృత్తి జీవితంలో ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డీన్-ఇండస్ట్రీ రేకేషన్స్ డాక్టర్ పి.ఎమ్ బాలాజీ, డాక్టర్ ఏ వి పవన్ కుమార్, అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి.నాగ శ్వేతా మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :