నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 07 : తంబళ్లపల్లె నియోజకవర్గం కేంద్రం పేరుకేమో గొప్ప అన్ని సమస్యలే పట్టించుకునే వారు లేక ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేశాయి. జిల్లా స్థాయి అధికారులు వచ్చి వెళుతున్న ఒక్క సమస్య పరిష్కారం కాక పోవడం విచారకరం. తంబళ్లపల్లె సచివాలయం మరమ్మతులకు నోచుకోక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. నడిబొడ్డులోని తాసిల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకొని మరమ్మతులకు నోచుకోక సుదూర ప్రాంతంలోని పి ఆర్ గెస్ట్ హౌస్ లో నిర్వహిస్తున్నారు.తంబళ్లపల్లెకు రెగ్యులర్ కార్యదర్శి లేక ప్రధాన ఆదాయ వనరులైన వారపు సంత, బస్టాండ్ గేటు వేలంపాటలు నిర్వహణ లేక లక్షలాది రూపాయలు నష్టపోతున్నా ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వెంటాడుతుంది. ఇంటి పన్నులు వసూలు చేసినంత తొందర ఆదాయ వనరుల పెంపుతో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. గతంలో తంబళ్లపల్లెలో నిర్మించిన మురికినీటి కాలువలపై ప్రమాదాలు జరుగుతున్నా మూతలు వేయలేని దుస్థితి కొనసాగుతోంది. తంబళ్లపల్లె క్రాస్ రోడ్ లో నిత్యం వాహనాల రద్దీ తో ట్రాఫిక్ సమస్య తోపాటు పాఠశాలలు, ఆసుపత్రిల వద్ద స్పీడ్ బ్రేకర్లు లేక ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. తంబళ్లపల్లె పాత బస్టాండ్, క్రాస్ రోడ్ బస్ షెల్టర్లు వద్ద మహిళలకు మరుగుదొడ్లు లేక ఏళ్ల తరబడి మొత్తుకుంటున్నా మహిళల పట్ల ప్రేమ ఒలకపోసే నాయకులకు, అధికారులకు సమస్య కాన రాకపోవడం సిగ్గుచేటు. ఇప్పటికైనా తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రం లోని తాసిల్దార్ కార్యాలయం,సచివాలయం మరమ్మత్తు, కాలవలపై మూతలు, మహిళలకు మరుగుదొడ్లు, స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్ సమస్య, వారపు సంత స్థలం, డైలీ మార్కెట్, వారపు సంత, బస్టాండ్ గేటు నిర్వహించి ఆదాయ వనరు పెంపు, మల్లయ్య కొండకు వెళ్లే రహదారులు విస్తరణ, ప్రైవేట్ వాహనాలకు పార్కింగ్ చేపట్టాల్సి ఉంది
Reporter
Namitha News