నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి జిల్లా ఏర్పాటుతో నెరవేరిన ప్రజల ఆకాంక్ష - ఆర్టీసీ 1,2 డిపోల గౌరవాధ్యక్షులు నాగూర్ వలి హర్షం - సీఎం చంద్రబాబు,ఎమ్మెల్యే షాజహాన్ బాషాలకు కృతజ్ఞతలు మదనపల్లె : మదనపల్లి జిల్లా ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల ఆకాంక్ష నెరవేరిందని మదనపల్లి ఏపీఎస్ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా) పేర్కొన్నారు.ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు మదనపల్లి పర్యటనలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మదనపల్లి జిల్లాగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు.ప్రస్తుతం జిల్లాగా ఏర్పాటు చేసి ఆ హామీని నిలబెట్టుకున్నారని కొనియాడారు.గత వైసిపి ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు ఇక్కడి ప్రజల మనోభావాలను,ప్రజాసంఘాల ఉద్యమాలను పరిగణనలోకి తీసుకోకుండా మదనపల్లిని జిల్లా చేయకుండా నిర్లక్ష్యం చేశారన్నారు.దీంతో అప్పుడు తెలుగుదేశం పార్టీలో తమతోపాటు వివిధ ప్రజాసంఘాలు అనేక ఉద్యమాలు చేపట్టామన్నారు.వైసిపి ప్రభుత్వం తమపై అక్రమ కేసులు బనాయించిందన్నారు.అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా మదనపల్లి జిల్లా కోసం పోరాట పోరాటాలు చేశామని గుర్తు చేశారు.ఎంతో సుదీర్ఘమైన చరిత్ర కలిగిన,ప్రశాంతమైన వాతావరణం కలిగిన మదనపల్లి జిల్లాగా ప్రకటించిన ఈరోజు ఇక్కడి ప్రజలకు పండుగ రోజు అని కొనియాడారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,మంత్రి నారా లోకేష్ బాబు,ఎమ్మెల్యే షాజహాన్ బాషాలకు మదనపల్లి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
Reporter
Namitha News