Monday, 27 July 2026 01:17:33 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

తంబళ్లపల్లెలో అక్రమ లేఔట్లపై కొరడా ఝలిపిస్తాం - డి.ఎల్.పి.ఓ. నాగరాజు

Date : 14 July 2026 12:18 PM Views : 599

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 13 : తంబళ్లపల్లె లోని పంచాయతీరాజ్ చట్ట ఉల్లంఘన జరిగిన కొరడా ఝలిపిస్తామని డి ఎల్ పి ఓ నాగరాజు హెచ్చరించారు. తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలో గత కొన్నేళ్లుగా అక్రమ లేఔట్ లు వెలిసినట్లు జిల్లాస్థాయి అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదు మేరకు సోమవారం డిఎల్పిఓ నాగరాజు ఎంపీడీవో కార్యాలయంలో తంబళ్లపల్లె పంచాయతీ అధికారులతో సమావేశం జరిపి లేఔట్ల సమస్య పై ఆరా తీశారు. అనంతరం ఆయన ఎంపీడీవో ఉషారాణి, డిప్యూటీ ఎంపీడీవోలు ఎం వి ప్రసాద్, మారుతీ కుమార్, కార్యదర్శి శ్రీనివాసరావు, పంచాయతీ అధికారుల తో కలిసి లేఅవుట్లోపర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపాదిత లేఔట్ లో ఆట స్థలానికి, పార్కు, విద్యా సంస్థ ఏదైనా ఇతర ప్రజా ప్రయోజనానికి మొత్తం విస్తీర్ణంలో 10 శాతం గ్రామ పంచాయతీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయలేదని గుర్తించారు. పాత జడ్పీ హైస్కూల్ వెనుక భాగంలో వేసిన 11.30 ఎకరాల భూమికి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం అభివృద్ధి నియమ నిబంధనలలో అతిక్రమణ జరిగిందని తెలిపారు. ఈ లేఔట్ కి సంబంధించి వెంటనే రెవిన్యూ అధికారుల నుండి రికార్డులు సేకరించి పంచాయితీ రాజ్ చట్టం అనుగుణంగా 10 శాతం భూమి పంచాయతీ కి చెందాల్సి ఉందని వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయడానికి అధికారులు చొరవ చూపాలని మండల పరిషత్ అధికారులు, కార్యదర్శిని ఆదేశించారు. ఆయన వెంట టిడిపి నాయకుడు కొండ్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి తోపాటు మండల సర్వేయర్ నాగరాజు,విఆర్ఓ నాగరాజు, వీఆర్ఏ ప్రసాద్, పద్మావతి, భాస్కర్ ప్రజలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :