నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 13 : తంబళ్లపల్లె లోని పంచాయతీరాజ్ చట్ట ఉల్లంఘన జరిగిన కొరడా ఝలిపిస్తామని డి ఎల్ పి ఓ నాగరాజు హెచ్చరించారు. తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలో గత కొన్నేళ్లుగా అక్రమ లేఔట్ లు వెలిసినట్లు జిల్లాస్థాయి అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదు మేరకు సోమవారం డిఎల్పిఓ నాగరాజు ఎంపీడీవో కార్యాలయంలో తంబళ్లపల్లె పంచాయతీ అధికారులతో సమావేశం జరిపి లేఔట్ల సమస్య పై ఆరా తీశారు. అనంతరం ఆయన ఎంపీడీవో ఉషారాణి, డిప్యూటీ ఎంపీడీవోలు ఎం వి ప్రసాద్, మారుతీ కుమార్, కార్యదర్శి శ్రీనివాసరావు, పంచాయతీ అధికారుల తో కలిసి లేఅవుట్లోపర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపాదిత లేఔట్ లో ఆట స్థలానికి, పార్కు, విద్యా సంస్థ ఏదైనా ఇతర ప్రజా ప్రయోజనానికి మొత్తం విస్తీర్ణంలో 10 శాతం గ్రామ పంచాయతీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయలేదని గుర్తించారు. పాత జడ్పీ హైస్కూల్ వెనుక భాగంలో వేసిన 11.30 ఎకరాల భూమికి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం అభివృద్ధి నియమ నిబంధనలలో అతిక్రమణ జరిగిందని తెలిపారు. ఈ లేఔట్ కి సంబంధించి వెంటనే రెవిన్యూ అధికారుల నుండి రికార్డులు సేకరించి పంచాయితీ రాజ్ చట్టం అనుగుణంగా 10 శాతం భూమి పంచాయతీ కి చెందాల్సి ఉందని వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయడానికి అధికారులు చొరవ చూపాలని మండల పరిషత్ అధికారులు, కార్యదర్శిని ఆదేశించారు. ఆయన వెంట టిడిపి నాయకుడు కొండ్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి తోపాటు మండల సర్వేయర్ నాగరాజు,విఆర్ఓ నాగరాజు, వీఆర్ఏ ప్రసాద్, పద్మావతి, భాస్కర్ ప్రజలు పాల్గొన్నారు
Reporter
Namitha News