Monday, 27 July 2026 04:48:50 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఘనంగా శ్రీ భక్త కనక దాస జయంతి 538వ జయంతి ఉత్సవ వేడుకలు

Date : 08 November 2025 09:18 PM Views : 183

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 08 : అన్నమయ్య జిల్లా రాయచోటి నందు కురుబ సంఘం నాయకులు శ్రీ భక్త కనకదాసు 538వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మరియు రాష్ట్ర కురుబ సంఘం నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు కనకదాసు చిత్రపటానికి పూలమాలవేసి మాట్లాడుతూ కర్ణాటక సంగీతం తాత్వికవేత్త పేదల పట్ల ప్రేమాభిమానాలు కలిగినటువంటి శ్రీ భక్త కనకదాస వారిని వేనోళ్ళ కొనియాడారు. అనంతరం అన్నదాన వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షులు తరిగొండ ఈశ్వరయ్య మాట్లాడుతూ అంతటి మహానుభావుల యొక్క జయంతిని నిర్వహించేటువంటి భాగ్యం కలిగినందుకు జీవితం ధన్యమని వారి యొక్క జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శప్రాయంగా ఆదర్శప్రాయంగా తీసుకోవాలని తెలిపారు .అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు కురువ సంఘం లయన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ తాత్వికవేత్త సామాజిక స్పృహ సంగీత కళాకారులు హరికథా పితామహులు అయినటువంటి శ్రీ భక్త కనకదాస గారి యొక్క జీవితం ఆదర్శనీయమని వారి యొక్క జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు .అనంతరం అడ్వకేట్ రవిశంకర్ మాట్లాడుతూ ధార్మికవేత్త అయినటువంటి శ్రీ భక్త కనకదాసు గారి జీవితాన్ని ఎల్లవేళలా ప్రతి ఒక్కరూ ఆదర్శప్రాయంగా నిలుపుకోవాలని వారి యొక్క జీవితాన్ని మన యొక్క జీవితంలో ఎల్లవేళలా గుర్తుంచుకొని మార్గదర్శకంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని కురుబ నాయకులు సుధాకర్, అంకి శెట్టిపల్లి జబ్బల రెడ్డప్ప, మదనపల్లి మడికయుల శివాలయం చైర్మన్ కొప్పల వెంకటరమణ, మురళీ కుమార్, రెడ్డన్న, నాగేంద్ర, రమణయ్య, రవి, చంద్ర మోహన్ తదితరులు మరియు సంఘ సభ్యులు అందరూ విరివిగా పాల్గొన్నారు

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :