Sunday, 26 July 2026 01:38:54 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

మిట్స్ లో ఏ.ఐ. & సిలికాన్ ఆధారిత సాంకేతిక ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్‌షిప్ పై వర్క్ షాప్

Date : 02 February 2026 05:19 PM Views : 144

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 02 : అంగళ్లు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా సైన్స్) విభాగం వారు ఏఐసిటిఈ (అఖిల భారత సాంకేతిక విద్యా మండలి), న్యూ ఢిల్లీ వారి సహకారంతో కృత్రిమ మేధస్సు, సిలికాన్ ఆధారిత సాంకేతిక ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్‌షిప్ & రీసెర్చ్ అవకాశాలు అనే అంశంపై మూడు రోజుల జాతీయ స్థాయి వర్కుషాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఐఐటీ మద్రాస్ ఆర్&డి అడ్వైజర్ ప్రొఫెసర్ దండు రాధాప్రసాదరాజు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్ కళాశాలలు కేవలం బోధనకే పరిమితం కాకుండా, వినూత్న పరిశోధనల ద్వారా సమాజ సమస్యలకు పరిష్కారాలు చూపాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్యంగా యువ అధ్యాపకులు మరియు విద్యార్థులు స్టార్టప్‌లు, పేటెంట్లు, మరియు పరిశోధన ప్రాజెక్టుల వైపు దృష్టి సారిస్తే, జాతీయ స్థాయిలో నిధులు పొందే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డీఆర్‌డీఓ, రక్షణ మంత్రిత్వ శాఖలో మాజీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ కె.ఎస్. భానుమతి మరియు ఎస్ ఓ సి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రతినిధి డాక్టర్ వీణ ఎస్ చక్రవర్తి లు పాల్గొని పరిశ్రమల్లో డిజిటల్ టెక్నాలజీ సహాయంతో ఉత్పత్తి నాణ్యత పెంచడం, తయారీ సమయం తగ్గించడం, ఖర్చులు నియంత్రించడం మరియు పర్యావరణహిత తయారీ విధానాలు అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. మరియు సిలికాన్ టెక్నాలజీల పాత్ర అత్యంత కీలకమని, ముఖ్యంగా ఆరోగ్యం, పరిశ్రమలు, రక్షణ, ఆటోమేషన్ మరియు స్మార్ట్ పరికరాల రంగాల్లో వీటి వినియోగం వేగంగా పెరుగుతోందని తెలిపారు. విద్యార్థులు ఈ ఆధునిక సాంకేతికతల్లో నైపుణ్యం సాధిస్తే అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఎస్ కుసుమ, కోఆర్డినేటర్ డాక్టర్ కే.నిర్మల దేవి, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: