నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వైసిపి మదనపల్లె టౌన్ మహిళ అధ్యక్షురాలు ఏ.ఆపర్ణ ను పరామర్శించిన మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహ్మద్... భర్త అకాల మృతితో పుట్టెడు దుఖఃతో వున్న వైసిపి మహిళ టౌన్ అధ్యక్షురాలు ఏ.అపర్ణ ను మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహ్మద్ పరామర్శించి, సొంత అన్నలాగా ఓదార్చి దైర్యం చెప్పారు. అపర్ణ భర్త ఆదోని వెంకటరమణ రెండు రోజుల క్రితం అకాల మరణం చెందారు. మాజీ టమోటా మార్కెట్ డైరెక్టర్, వైసిపి మహిళ టౌన్ అధ్యక్షురాలు అపర్ణ వైసిపిలో సిన్సియర్ నాయకురాలుగా గుర్తింపు వుంది. అపర్ణ భర్త అకాల మరణం గురించి తెలిసిన వెంటానే నిసార్ అహ్మద్ వారి స్వగృహనికి వెళ్ళి అపర్ణ, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి దైర్యం చెప్పారు. పార్టీ అన్నివిధాలా అండగా వుంటుందని భరోసా ఇచ్చారు. నిసార్ అహ్మద్ తోపాటు వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News