నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజినీరింగ్ కాలేజీలో జాతీయ స్థాయి ఐడియ స్ప్రింట్ మదనపల్లె సమీపంలోని విశ్వం ఇంజినీరింగ్ కాలేజీ ఆధ్వర్యంలో ఐడియ స్ప్రింట్ జాతీయస్థాయి ఆవిష్కరణ సవాలును ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఈ సమ్మిట్ 26 – నిర్మాణాత్మక ప్రభావ కార్యక్రమంలో భాగంగా, ఐఐటి తిరుపతి నవ ఆవిష్కార్ ఐ హబ్ ఫౌండేషన్ మరియు ఈ సెల్, ఐఐటి తిరుపతి సహకారంతో జరుగుతోంది. ఈ పోటీ రెండు దశల్లో నిర్వహించనున్నారు. రౌండ్-1 జనవరి 23 & 24, 2026 తేదీలలో, రౌండ్-2 జనవరి 31, 2026 న విశ్వం ఇంజినీరింగ్ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్లో ఆఫ్లైన్ విధానంలో జరుగనుంది. విజేతలకు రూ. 50,000 నగదు బహుమతులతో పాటు ఐఐటి తిరుపతిలో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించనున్నారు. ఈ పోటీలో CS, CSE, CST, AI&DS, EEE, ECE విభాగాల విద్యార్థులు చురుకుగా పాల్గొని తమ ఆవిష్కరణాత్మక ఆలోచనలను ప్రదర్శించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, డీన్ (R&D), HODలు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ ఎం. ప్రభాకర్ రెడ్డి గారు, ప్రిన్సిపాల్ డా. డి. రమణ రెడ్డి గారు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి పోటీలు విద్యార్థుల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులందరూ కొత్త ఆవిష్కరణలు చేసే విధంగా విద్యార్థుల ప్రతిభను వెలికి తీయాలని తెలియజేశారు.
Reporter
Namitha News