నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె- జూలై 09 : మొరుసుకాపు(ఒక్కలిగ)ల ఆది పురుషుడు నాడ ప్రభు కెంపెగౌడ 517వ జయంతి ఈనెల 12న బి కొత్తకోటలో జరిగే ఉత్సవాన్ని ప్రతి మొరుసుకాపు రాజకీయాలకు అతీతంగా హాజరై విజయవంతం చేయాలని మొరుసు కాపు సంఘం సభ్యులు పిలుపునిచ్చారు. గురువారం ఈ సందర్భంగా మొరుసు కాపు సంఘ సభ్యులు కెంపె గౌడ జయంతి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ ఆదివారం 10 గంటలకు బి.కొత్తకోట నగర పంచాయతీ పీటిఎం రోడ్డు రాజా ఫంక్షన్ హాల్ నుండి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. కెంపెగౌడ వేషధారణతో గుర్రపు స్వారీ విన్యాసాలు, కోలాటాలు, చెక్క భజనలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పీ.టి.యం రోడ్డు,నుండి జ్యోతి చౌక్ మీదుగా దిగువ బస్టాండ్, బైపాస్ రోడ్డు, రంగసముద్రం రోడ్డు, జ్యోతి బస్టాండ్ మీదుగా భారీ ర్యాలీతో ఏకే ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమావేశం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి బి.గోపాల్ గౌడ్, శ్రీనివాస పురం ఎమ్మెల్యే వెంకట శివారెడ్డి, కర్ణాటక రాష్ట్ర మొరుసు కాపు సంఘం కార్యదర్శి కోనపరెడ్డి హాజరవుతారన్నారు. ఈ సమావేశానికి ప్రతి మొరుసు కాపు సంఘ సభ్యుడు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు
Reporter
Namitha News