నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 20 : ప్రభుత్వ ఆదేశాల మేరకు సచివాలయ ఉద్యోగులు హౌస్ హోల్డ్ సర్వే వేగవంతం చేయడానికి కృషి చేయాలని ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ సూచించారు. శుక్రవారం ఆయన మండలంలోని గుండ్లపల్లి పంచాయతీలో సుడిగాలి పర్యటన చేసి సచివాలయ సిబ్బంది చేపట్టిన హౌస్ హోల్డ్ సర్వేపై ఆరా తీశారు. హౌస్ హోల్డ్ సర్వే నిష్పక్షపాతంగా నిర్వహించాలని ప్రతి కుటుంబాన్ని సందర్శించి పూర్తిస్థాయిలో సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ఇప్పటికీ మండలంలో 69 శాతం సర్వే పూర్తయిందని త్వరలో హౌస్ హోల్డ్ సర్వే పూర్తి చేయడానికి సచివాలయ ఉద్యోగులను పరుగులు పెట్టిస్తున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ఆయన వెంట డిప్యూటీ ఎంపీడీవో మారుతి కుమార్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు
Reporter
Namitha News