నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 11 : మదనపల్లి పట్టణం లోని సుభాష్ రోడ్, వివేకానంద నగర్, దోబీ ఘాట్ వద్ద తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు రాటకొండ భారతీయుడు, శ్రీరామ నాగమణి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తెలుగుదేశం పార్టీ జెండాలను ఎమ్మెల్యే షాజహాన్ భాషా చేతుల మీదుగా ఆవిష్కరించారు
సుభాష్ రోడ్ లో భారతి నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జెండాను ఆవిష్కరించి, మిఠాయిలను పంచిన ఎమ్మెల్యే కార్యకర్తల నుద్దేశించి మాట్లాడుతూ ప్రజా క్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం , మీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ పాలనను ప్రజలకు చేరువ చేస్తున్నారని ఎమ్మెల్యే షాజహాన్ భాష పేర్కొన్నారు ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి ఈ రెండు సంవత్సరాల లోనే నియోజకవర్గంలో ఇప్పటివరకు 90 కోట్లతో పనులు చేపట్టడం, రానున్న మూడు నెలలలో పది కోట్లకు పైగా రూపాయలు ఖర్చు చేసి రోడ్లు ఫ్లైఓవర్లు నిర్మించడం జరుగుతుందని తెలిపారు
ఈ కార్యక్రమంలో నవీన్ చౌదరి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి తులసి రామకృష్ణ, కౌన్సిలర్ నాగార్జున బాబు, పట్టణ అధ్యక్షుడు అరుణ్ తేజ్,జాఫరున్నిస , పులి మహాలక్ష్మి, రాటకొండ మధుబాబు, పూల మురళి, రమేష్ రెడ్డి, బాలమణి శేఖర, ట్యూషన్ మైనార్టీ సెల్ నాయకులు జాన్ బాబు, మాజీ కౌన్సిలర్ లక్ష్మీదేవి, కప్పల శ్రీరాములు, మల్లికార్జున్ నాయుడు, టౌన్ బ్యాంకు డైరెక్టర్ సోమశేఖర్ నాయుడు, తాళ్లగిరి, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News