నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - మే 27 : రాయచోటి డివిజన్లోని గాలివీడు, రామాపురం మండలాల్లో జనాభా గణన-2026 ప్రక్రియను క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఈ సందర్బంగా సిబ్బంది కి ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా జిల్లాలో జనాభా గణన ప్రక్రియను ఖచ్చితత్వంతో, పారదర్శకంగా నిర్వహించాలని గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి జనాభా గణన పూర్తిచేసి, గృహాలకు వేసిన డోర్ నెంబర్లు, నమోదు చేసిన వివరాలు, ఆన్లైన్లో నమోదు చేసిన సమాచారాన్ని రికార్డులతో సరిపోల్చి పరిశీలించారు. అలాగే సంబంధిత కుటుంబ సభ్యులను నేరుగా అడిగి వివరాలను ధ్రువీకరించుకున్నారు. అలాగే ఖాళీగా ఉన్న మరియు తాళం వేసిన గృహాలను మరోసారి పునఃపరిశీలన నిర్వహించి, అవసరమైతే సమాచారాన్ని తిరిగి నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు
Reporter
Namitha News