నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : భర్త నుంచి న్యాయం చేయాలంటూ ఓ మహిళ భర్త ఇంటి ముందర ధర్నాకు దిగిన ఘటన ఆదివారం మదనపల్లె స్థానికంగా ప్రశాంత్ నగర్ లో చర్చనీయాంశంగా మారింది. భర్త తనను నిర్లక్ష్యం చేస్తూ, కుటుంబ బాధ్యతలను తప్పించుకుంటున్నాడని ఆరోపిస్తూ భార్య రోజా రాణి ఈ నిరసనకు దిగింది. భార్య రోజా రాణి భర్త కృష్ణ ఇంటి ఎదుట కూర్చుని తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. పెళ్లి తర్వాత నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నానని, ఆర్థికంగా మరియు మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పలుమార్లు కుటుంబ సభ్యులకు, పెద్దలకు చెప్పినా ఫలితం లేకపోవడంతో చివరకు బహిరంగ నిరసనకు దిగాల్సి వచ్చిందని తెలిపింది. భర్త ఇంట్లో నుంచి బయటకు వచ్చి గొడవకు దిగడంతో, చుట్టుపక్కల వారు సంఘటనను వీక్షిస్తూ గుమికూడారు.
Reporter
Namitha News