నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 03 : మదనపల్లి జిల్లా రవాణా శాఖ కార్యాలయం కు చెందిన ఆర్టీఓ, సహాయక మోటర్ వాహన తనిఖీ అధికారులు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను, తేలికపాటి మోటార్ వాహన డ్రైవర్లకు సీట్ బెల్టు ధరించటం యొక్క ప్రాముఖ్యతను వివరించి అవగాహన కల్పించి, వారికి, ప్రజలకు పాంప్లెట్లు పంపిణీ చేశారు. విద్య సంస్థలలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించుటకు పాఠశాలలు కళాశాల యాజమాన్యులు వాహన డీలర్లు మరియు ప్రైవేటు డ్రైవింగ్ స్కూల్ యాజమాన్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన అధికారులు. ఈ కార్యక్రమంలో భాగంగా మదనపల్లె పుంగనూరు మరియు మండల కేంద్రాలలోని ముఖ్య కూడలిలో రోడ్డు భద్రతకు సంబంధించిన బ్యానర్లను ప్రదర్శించాలని డీలర్లకు సూచించిన అధికారులు
Admin
Namitha News