నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : టిట్కో ఇల్లా వద్ద చేనేత మగ్గాలకు స్థలం కేటాయించాలి.. కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన నేతన్నలు... నీరుగట్టువారి పల్లెలో చేనేత కార్మికులుగా పనిచేస్తున్న 100 కుటుంబాల వారికి తిరుపతి రోడ్డు టిట్కో ఇల్లు మంజూరు చేయడంతో టిట్కో ఇళ్ల వద్ద నుండి నీరుగట్టువారి పల్లి కి రావటానికి ఆరు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తుందని, రోజు వంద రూపాయలకు పైగా పెట్రోల్ ఖర్చు అవుతుందని, ప్రభుత్వ పెద్దలు స్పందించి నిరుపేదలైన మాకు టిట్కో ఇళ్ల వద్ద చేనేత షెడ్లను నిర్మించి ఇవ్వాలని కోరుతూ నేడు సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు మీడియాకు తెలిపారు.. టిట్కో ఇళ్లలో నివాసం లేని వారి ఇల్లును రద్దు చేస్తామని ప్రభుత్వ ఉద్యోగులు చెప్పడం తమకు చాలా బాధ కలిగిస్తుందని... అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు... ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నేతన్న కుటుంబాలు పాల్గొన్నారు...
Reporter
Namitha News