Sunday, 26 July 2026 10:08:29 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మిట్స్ విద్యార్థులకు స్టార్ట్‌అప్స్ కోసం సమర్థవంతమైన సేల్స్ & మార్కెటింగ్ వ్యూహాలపై అవగాహన

Date : 31 January 2026 08:23 PM Views : 108

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 31 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్) విభాగం వారు మిట్స్ ఐ ఐ సి ఆధ్వర్యంలో స్టార్ట్‌అప్స్ కోసం సమర్థవంతమైన సేల్స్ & మార్కెటింగ్ వ్యూహాలు అనే అంశంపై విద్యార్థులకు అతిధి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తిరుపతి కి చెందిన కొటాక్ లైఫ్ ఇన్సూరెన్స్ కో ఆపరేటివ్ లిమిటెడ్ డిప్యూటీ చీఫ్ మేనేజర్–ట్రైనింగ్, పి.రామకృష్ణ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్టార్ట్‌అప్స్ ప్రారంభ దశలో ఎదురయ్యే సవాళ్లు, మార్కెట్ అవసరాలను గుర్తించడం, వినియోగదారులను ఆకర్షించే విధానాలు వంటి అంశాలపై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వ్యాపార దృష్టికోణం కూడా కలిగి ఉండాలని, పరిశ్రమ ఆధారిత విద్య మరియు ప్రాక్టికల్ అనుభవం స్టార్టప్ విజయానికి కీలకమని అన్నారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో డిజిటల్ మార్కెటింగ్, బ్రాండింగ్ మరియు కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయని అన్నారు. సరైన సేల్స్ మరియు మార్కెటింగ్ వ్యూహాలు అమలు చేయడం ద్వారా నూతన ఆవిష్కరణలు వేగంగా అభివృద్ధి చెందగలవని తెలిపారు. ముఖ్యంగా సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్రచారం ద్వారా వ్యాపారాన్ని విస్తరించవచ్చని సూచించారు. విద్యార్థులు సరైన కమ్యూనికేషన్ స్కిల్స్, మార్కెట్ అవగాహన, సేకరించిన సమాచారాన్ని పరిశీలించి, అర్థం చేసుకుని సరైన ఆలోచనలతో పాటు ప్రాక్టికల్ అనుభవం ఉంటే స్టార్ట్‌అప్స్‌లో వేగంగా అభివృద్ధి చెందదడంతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఆర్.కల్పనా, కోఆర్డినేటర్ టి.పవన్, కో కోఆర్డినేటర్ డాక్టర్ చొక్కనాథన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :