నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 08 ః తంబళ్లపల్లె మండల కేంద్రంలో మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. తంబళ్లపల్లె ద్వారకానగర్ నుండి పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ (నేటి తాసిల్దార్ కార్యాలయం) అనంతరం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి స్వగృహం మీదుగా సచివాలయం, విద్యుత్తు సబ్స్టేషన్, అటు కోర్టు, ఆర్టీసీ బస్టాండ్, రహదారులను కలుపుతూ మల్లయ్య కొండకు అక్కమ్మ చెరువు కట్ట మీదుగా వేసిన రోడ్డు కంకర తేలి వాహన చోదకులు, పాద చారులకు తీవ్ర ఇబ్బందిగా తయారైంది. మండలంలో ఈ మధ్యకాలంలో పలు రోడ్లు మరమ్మత్తులు చేస్తున్నా తంబళ్లపల్లె కూత వేటు దూరంలోని ప్రధాన రహదారి మరమ్మతులకు మండల పరిషత్ అధికారులు పట్టించుకోకపోవడం విచారకరం. ఇప్పటికైనా సంబంధిత మండల పరిషత్, పంచాయతీ అధికారులు ఈ రోడ్డు మరమ్మతులకు చర్యలు చేపట్టాల్సి ఉంది
Reporter
Namitha News