నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 21 : అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి బుధవారం రాయచోటి సబ్ డివిజన్ పరిధి లోని వాయల్పాడు మరియు పీలేరు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ల లోని రికార్డులను, లాకప్ రూమ్ ను మరియు పరిసరాలను నిశితంగా పరిశీలించారు. అనంతరం పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ పర్యటనలో ఎస్పీ పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి ముఖ్య సూచనలు చేశారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి. బాధితులకు భరోసా కల్పించి, వారి సమస్యలను చట్టభద్ధంగా త్వరితగతిన పరిష్కరించాలి. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో గస్తీ పెంచాలి. పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలి. పెండింగ్లో ఉన్న కేసులను శాస్త్రీయ పద్ధతుల్లో దర్యాప్తు చేసి, త్వరితగతిన ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలి. మహిళలు, పిల్లల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి పోలీస్ అధికారి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, తద్వారా నేరాల ఛేదనలో వేగం పెరుగుతుందని సూచించారు. సిబ్బంది సంక్షేమ పై దృష్టి సారించాలని, ఆయా పోలీస్ స్టేషన్ అధికారులకు సూచించారు.
ప్రజలకు నిద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ గుర్తుతెలియని వ్యక్తులకు ఓటిపి లు చెప్పవద్దని, ఏదైనా మోసం జరిగితే వెంటనే 1930 కి ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కోరారు. గ్రామాలలోని కొత్త వ్యక్తుల గురించి లేదా అనుమానాస్పద కదలికల గురించి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాయచోటి డిఎస్పీ మహేంద్ర , పీలేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ యుగంధర్ , ఎస్ఐలు లోకేష్, ఎస్ రహీం, వాయల్పాడు ఎస్ఐ తిప్పేస్వామి మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
Admin
Namitha News