నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 30 : వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా మండలంలోని ఆలయాలు భక్తుల తో కిటకిటలాడాయి. మంగళవారం మల్లయ్య కొండ శివాలయం లో వేలాదిగా భక్తులు తరలివెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు అభిషేకాలు నిర్వహించారు, అదేవిధంగా కోసువారిపల్లె శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయంలో టిటిడి ఆధ్వర్యంలో జరిగిన వైకుంఠ ఏకాదశికి భక్తులు పోటెత్తారు. వెంకటేశ్వర స్వామికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కుక్క రాజు పల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, తంబళ్లపల్లె రామాలయం, సాయిబాబా ఆలయాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో వెలసిన రామాలయాలలో స్థానిక ప్రజలు వైకుంఠ ఏకాదశి సందర్భంగా పూజలు నిర్వహించి చెక్కభజనలు, కోలాటాలు, రామ కీర్తనలు ఆలపించారు.
Reporter
Namitha News