నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - డిసెంబర్ 07 : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అసాంఘిక కార్యక్రమాల కట్టుడికి వివిధ రకాల తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల మేడం ఆదేశాలతో ఆత్మకూరు డిఎస్పి కే.వేణుగోపాల్ గారి సూచనలతో ఆత్మకూరు సిఐ గంగాధర్ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలో నేటి ఉదయం నుండి పలు ప్రాంతాలలో వాహన తనిఖీలు చేపట్టారు. పట్టణ శివారులో మరియు గ్రామీణ ప్రాంతాలలో అనుమానం ఉన్న ప్రాంతాలన్నీ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా నేడు ఏఎస్ పేట మండల కేంద్రంలోని లాడ్జిలు, విశ్రాంతి గృహాలు, గెస్ట్ హౌస్ లను ఆత్మకూరు సిఐ గంగాధర్, ఆత్మకూరు ఎస్సై జిలాని మర్రిపాడు ఎస్సై శ్రీనివాసులు వారి సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లాడ్జిలలోని రూములన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు.లాడ్జిలలో ఉండే వ్యక్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఎవరైనా అనుమానస్పదమైన వ్యక్తులు గాని వారి కదలికలు గాని కనిపెడుతూ పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా లాడ్జి నిర్వాహకులకు సూచించారు.. నెల్లూరు జిల్లాలో నేరచరిత్ర ఉన్న వ్యక్తుల కదలికలను గమనిస్తూ అసాంఘిక కార్యక్రమాల నిర్మూలనకు ప్రత్యేక దృష్టి పెడుతూ నిరంతరం తనిఖీలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల మేడం ఇచ్చిన ఆదేశాలతో జిల్లాలో అన్ని ప్రాంతాలలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సిఐ గంగాధర్ తెలిపారు.
Reporter
Namitha News