నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 31 : అన్నమయ్య జిల్లా కేంద్రం గా మదనపల్లి ని ఏర్పాటుతో తంబళ్లపల్లె నియోజకవర్గం అన్ని రంగాలుగా అభివృద్ధి చెందడం ఖాయమని స్థానిక ప్రజలకు ఇది ఓ వరమని రాష్ట్ర అధికార ప్రతినిధి పర్వీన్ తాజ్, జిల్లా బిసి సెల్ అధ్యక్షుడు సురేంద్ర యాదవ్,రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు తులసీదర్ నాయుడు, మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్రలు కొనియాడారు. బుధవారం ఎన్టీఆర్ ఘాట్ లో మదనపల్లె జిల్లా ఏర్పాటుపై రాష్ట్ర నాయకుల చిత్రపటాల ముందు కృతజ్ఞతలు తెలియజేస్తూ భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్,ప్రధాని నరేంద్ర మోడీ కి జయ జయ ద్వానాలు పలికారు. కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి నినాదాలతో మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు హోరెత్తించారు.ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి కూటమి నాయకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News