నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - డిసెంబర్ 31 : పుంగనూరు లోని తూర్పు ముగుసాలలోని టిటిడి కళ్యాణమండపం రోడ్డు నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో బయోమెట్రిక్ ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే వేలిముద్ర తీసుకుని నగదును లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు. వితంతు పింఛన్ మరియు వృద్ధాప్య పింఛన్ల పంపిణీ స్వయంగా పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇంటి వద్దనే పెన్షన్ అందుతుందా, ఏ రోజు పింఛను అందుతోంది, ఎన్ని గంటల సమయంలో అందుతుంది, గతంలో ఎంత వస్తుండేది? ఇప్పుడు ఏంత వస్తున్నది వంటి ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు.
Admin
Namitha News