నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - డిసెంబర్ 22 : పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సోమవారం శ్రీనివాస రామానుజన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ రాధాకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ అని, గణిత శాస్త్ర రంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. గణిత శాస్త్ర అధ్యాపకులు శివయ్య మాట్లాడుతూ, గణితంలో రామానుజన్ సాధించిన విజయాలు అనితరసాధ్యమైనవని పేర్కొన్నారు. ఆయన పేరు మీదుగా ప్రతి సంవత్సరం సహస్ర అవార్డ్స్ మరియు ఐసిటిపి అవార్డులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. రామానుజన్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ప్రతి విద్యార్థిని కష్టపడి చదువుతూ ముందుకు సాగాలని సూచించారు. ఈ మేరకు కళాశాలలో వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలు నిర్వహించగా, వాటిలో విజయం సాధించిన విద్యార్థినిలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థినిలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Reporter
Namitha News