నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 20 ః స్థానిక శాఖ గ్రంథాలయంలో ఈనెల 14 నుండి 20వ తేదీ వరకు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారోత్సవాలలో వ్యాసరచన, మ్యూజికల్ చైర్స్, ముగ్గుల పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎంఈఓ లు త్యాగరాజు, నాగ సుబ్బరాయుడు, హై స్కూల్ హెచ్ఎం శ్రీనివాసులు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి జిలానిభాష, ఉపాధ్యాయులు రెడ్డప్ప రెడ్డి, హేమలత, వెంకటరమణ, స్కూల్ కమిటీ చైర్మన్ శివకుమార్, పద్మావతి, సుగుణమ్మ, సాజిదా బేగం, గౌసియా, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.
Reporter
Namitha News